ఉప ఎన్నికల్లో భాగంగా ఇప్పుడు ప్రచారసాధనాల్లో ప్రతి పార్టీ పాటలు, అబినయాలతో వినూత్నంగా ప్రచారం చెయ్యడం బావుంది. కాని తెలుగుదేశం పార్టీ ప్రకటన, ఒక వంతు నవ్వు తెప్పిస్తొంది నా మటుకు.
మనకందరికి సుపరచితమైన సినిమా మిష్టర్ పెళ్ళాం. ఆ సినిమా లో రాజేంద్ర ప్రసాద్ భార్య ఆమని పని చేసే ఎం.డి. గోపాల క్రిష్ణ ని ఒకానొక పాట లో ఆటపట్టించిన సందర్భం గుర్తు వచ్చింది. ఆ పాట చివరిలో "గోపాల క్రిష్ణుడు పక్షి...గోవింద క్రిష్ణుడు పక్షి.." కోరుస్ అంతా కుడా పక్షి పక్షి అంటూంటారు .....ఎం.ఎస్ మొహం లో బాధ ఎక్కువైపోతుంటుంది..అది చూసి రాజేంద్ర ప్రసాద్ ఆనందపడుతుంటాడు. చివరకి కాని చెప్పడు పక్షి వాహనుడై వెడలె అని. వాక్యాలని పూర్తి గా చెప్పాలి లేక పోతే అర్ధాలు మారిపోతుంటాయి
తెలుగుదేశం ప్రకటన లో కూడా ఇదే జరిగింది. సన్నివేశం ఎలా ఉంటుందంటె ఒక తాగుబోతు ఇంటికి తాగి వస్తాడు. భార్య అతన్ని ఉద్దేసించి, పిల్లవాడికి మందులు తెమ్మంటె నువ్వు మందు తాగి వస్తావా అని అడుగుతుంది?పిల్లవాడికి మందులు తెద్దామంటె దబ్బులేక ఆ బాధ లో ఈ మందు తాగనంటాడు ..ఆ సందర్భం లో వాడు "నీ తల్లి బెల్టు తీస్తా అంటాడు.."అందుకు భార్య ఈ సారి చంద్రబాబు నాయుడు వస్తే బెల్టు షాపుల మీదా బెల్టు తీస్తాడు అంటుంది. ప్రకటన లో భాగంగా ఇదెక్కడి ఖర్మ (ఇక్కడ ఉపిరి పీల్చుకునే అంత గాప్) కడుపునిండా మద్యం వెంటనే తెలుగు దేశాన్ని గెలిపించండి అని వస్తుంది . నేను ఈ ప్రకటన మొదట్లొ చివరి రెండు లైన్లు మాత్రామే విన్నా ..చాలా నవ్వు వచ్చింది తరువాత పూర్తిగా విన్నాక అర్ధమైంది. ఏ భాషకైన డిక్షన్ చాల అవసరం లేక పోతే ఇలాగే నవ్వుకోవలసి వస్తుంది.
ఇది తెలుగుదేశం పార్టీ భావాలని కించపరచడానికి రాసింది మాత్రం కాదు. నాకు ఇలా తోచింది అని చెప్పడానికి మాత్రమే. ..
Sunday, May 25, 2008
కడుపు నిండా మద్యం-తెలుగుదేశానికే ఓటు.
Posted by
సుజన దుత్తలూరు
at
9:59 AM
2
comments
Wednesday, May 14, 2008
గజేంద్ర మోక్షం లో ని పద్యాలు
పోతానామత్యుల వారి చే ఆంధ్రీకరింపబడి వ్యాస భగవానుని విరచితమైన భాగవతం లో ని గజేంద్ర మోక్షం లో ని కొన్ని నాకిష్టమైన పద్యాలు.
లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్చ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప ఇతహ్ పరంబెరుగ మన్నింపం దగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా
సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముం చేదోయి సంధింప డే
పరివారంబును జీర డభ్రగపతిన్ మన్నింపడా కర్ణికాం
తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచో
పరి చేలాంచలమైన వీడడు హరి గజప్రాణా వనోత్సాహి యై
ఎవ్వని చేఁ జనించు జగ మెవ్వని లోపల నుండు లీనమై
ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు? మూల కారణం
బెవ్వ? డనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానె యైన వా
డెవ్వడు వాని నాత్మ భవు నీశ్వరు నే శరణంబు వేడెదన్
కలడందురు దీనుల యెడ
కలడందురు భక్త యోగి గణముల పాలం
గలడందురన్ని దిశలను
కలడు కలండనెడు వాడు కలడో లేడో
(తెలుగు పెరంట్ వారికి కృతజ్ఞతలతో)
Posted by
సుజన దుత్తలూరు
at
1:27 AM
3
comments
Tuesday, April 29, 2008
నీ కోసం ఎదురు చూస్తూ నీ...
తట్టి తట్టి లేపుతున్నట్టనిపించి లేచి చూసాను. ఆదివారం, సెల్ ఫోన్ లో సమయం 3గం.59ని.కావస్తోంది. ఎండాకాలం కాని బయట చల్లగా ఉంది. బహుశా ఇంకాసేపట్లో వర్షం పడబోతుందేమో. ఆరిన బట్టలు ఇంట్లోకి తెద్దామని బయటకు వెళ్ళబోతుంటే నిన్ను లేపింది నీ పనులు నువ్వు మళ్ళీ చేసుకోవడానికి కాదు, నాతో కాసేపు అలా గార్డెన్ లో కూర్చొని వేడిగా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామని. ఎన్ని రోజులైంది నువ్వు నాతో మాట్లాడి? పొద్దున్నే వాకింగ్ వెళ్ళేప్పుడు మనిద్దరం నడిచేది అరగంటే అయినా ముందు రోజు జరిగిన విషయాలన్ని చెప్పేదానివి. మరి ఇప్పుడు ఆ అరగంట కూడా ఐపాడ్ లో విష్ణు సహస్రనామం వింటున్నావు. లేకపొతే నీ తోటి నడిచేవాళ్ళతో అమెరికా లో రిసెషన్ గురించో లేక పాకిస్ఠాన్ లో సరబజిత్ క్షమాపణ గురించో మాట్లాడుతున్నావు.నేనసలు నీకు గుర్తున్నానా? అందంగా వికసించిన ఎర్ర గులాబిని చూసి నువ్వేసిన కృత్రిమ ఎరువు గురించి మాట్లాడుతున్నావు. అరె, అదే అంతకు ముందు నాతో దాని అందాన్ని, దాన్ని సృష్టించిన ప్రకృతిని గురించి గంటలు గంటలు గడిపేదానివి. నీలో ఎందుకింత మార్పు?ఎందుకింత కృత్రిమంగా తయారయ్యావు? పెనం మీద దోసె వేసి దాన్ని తిప్పుతూ సెల్ ఫోన్ లో కష్టమర్ కేర్ వాళ్ళతో ముందు నెల్లో ఎక్కువ వచ్చిన బిల్ గురించి కొట్లాడతావు. కాణి ఖర్చు లేకుండా నాతో మాట్లాడ్డానికి నీకు ఒక్క నిమిషం లేదా ?అసలేంటి నీ యాంత్రిక జీవనం ? పెద్దగా పరిచయం లేని వాళ్ళని వీకెండ్ కి భోజనానికి రమ్మని ఫోన్ లో పిలుస్తావే ? వాళ్లేసే జోకులకి నీ నుంచి వచ్చేది ప్లాస్టిక్ స్మైల్ కాదా ?నిజంగ సహజంగా నవ్వి ఎన్ని రోజులైంది ? ఎక్కడికి నీ ఉరుకులు ,పరుగులు ? ఎవరి కోసం ?
పాపయి సీతాకోకచిలుకని చూపించి కేరితలు కొడుతుంటే దానికి సైన్స్ భోధిస్తావు లార్వా అని,ప్యుపా అని, కాటర్పిల్లర్ అని.. అంతే కాని అది దాని రెక్కలు ఆడిస్తూ ఎగురుతూ ఉంటే రంగులు రంగులు గా మారే దాని అందాన్ని చెప్పలేవా ? తేనె కోసం పువ్వు పువ్వు మీదా వాలుతు చేసే శబ్దాన్ని నిశ్శబ్దంగా వినమని చెప్పలేవా ? ఆ చిన్ని పాపయి బుర్ర నుంచి నువ్వు ఎమి శోధిస్తున్నావు ?
రాత్రిళ్ళు పడుకోబోయే ముందు ఆ దిండు కింద సెల్ ఫొన్ ఎందుకు ?అర్ధరాత్రి కనీసం నీ కల్లో అయినా మాట్లాడుదామంటే వినూత్నమైన రింగ్ టోన్ తో అమెరికా నుంచి వచ్చే యూసర్ కాల్ తో నువ్వు బిజీ.వాడిచ్చే డాల్లర్ల కోసం సమయం ఉదయం నాలుగు గంటల దాకా పని. ఆ వత్తిడి ని తగ్గించుకోవడానికి యోగా చేస్తావు ..ఎందుకు ?
కాఫీ అయ్యిందిగా రా అలా కాసేపు గార్డెన్ లో కుర్చోని మాట్లాడుకుందాం.నాతో అరగంట సేపు సమయాన్ని వెచ్చించు, నీ కృత్రిమమైన జీవితాన్నుంచి దూరంగా వచ్చి నాతో మమేకమవ్వు. నీ యాంత్రిక జీవనాన్ని ఉల్లాసంగా గడపగలవని నేను భరోసా ఇస్తున్నాను. నాకు సహనం, ఓర్పు ఎక్కువ నీకోసం ఎన్ని రోజులైనా వేచి ఉంటాను నేస్తం. నాలోని మనుసు మౌనంగా నిరీక్షిస్తోంది నాతో మాట్లాడ్డానికి. ప్చ్ ...నాలోని మన్సు తో మాట్లడలేకపొతున్నా, ఇది నాలోని హిపోక్రసి కాదా ? నాది కృత్రిమమైన జీవితమా ..ఎమిటి ఈ సంఘర్షణ???
Posted by
సుజన దుత్తలూరు
at
11:06 AM
5
comments
Wednesday, April 16, 2008
రామయ్యా ..తేనేగూడు లో పొరపాటు జరిగిందయ్యా..
రామయ్య.. పొరపాటు జరిగిపోయిందయ్యా ..శ్రీ రామనవమి రోజు నిన్ను స్తుతిస్తూ భద్రాచలం లో అందంగా కొలువు తీరిన నీ ముఖచిత్రాన్ని అందరూ చూడాలనే ఆశ తో "చూచితిని సీతమ్మను రామా" (ఏప్రిల్ 14)అనే టపా ద్వారా అంతర్జాలం లో ప్రచురించాను. తేనేగూడు అనే బ్లాగుల సమాహారం లో బ్లాగు లో ని వ్యాసములను మూఖచిత్రం తో సహా చూపించే మొదటి పేజీ లో ఆ ముఖచిత్రం ఎలా వచ్చిందో మరి. సాంకేతిక కారణాలేలాంటివో నా చిత్తానికి నేను ఎరుగను. మరి ఎక్కడ పొరపాటు జరిగిందో ఏమో ..నా మనస్సాక్షిగా నేను ప్రచురించింది మాత్రం నీ ముఖచిత్రాన్నే ప్రభు. తప్పిదం జరిగిందనే ఆవేదనలో వారికి లేఖ కూడా వ్రాసాను. కాని ప్రత్యుత్తరం లేదు. ఎవరిని నిందించాలి అజ్ఞానపు అంతర్జాలాన్నా ? నీ ముఖచిత్రాన్ని వీక్షించలేని మా కన్నులనా..
నా మనవి ఆలకించు శ్రీరామ..నీవైనా చెప్పవమ్మా సీతమ్మా..
నా టపా కలిగిన లింకును ఇక్కడ పొందుపరుస్తున్నాను.
http://www.thenegoodu.com/?which=50&cid=&mode=
Posted by
సుజన దుత్తలూరు
at
8:26 AM
8
comments
Sunday, April 13, 2008
చూచితిని ..సీతమ్మను..రామా
రామయణం లో అన్నిటికన్న అత్యధ్భుతమైన వర్ణన సుందరకాండము. అసలు ఎందుకు "సుందర"కాండం అని పిలవబడుచున్నది ? ఈ లోకం లో బాహ్య సౌందర్యం , అంత:సౌందర్యం అని రెండు విధములు కదా ..భార్యభర్తలు ఆత్మీయతతో, ఆదరాభిమానలతో ఉన్నప్పుడు వారిద్దరు ఒకరికొకరు అందంగా కనిపిస్తారు. అలాగే వారి పిల్లకు మార్గదర్సకులైతే వాళ్ళు చాలా సౌందర్యవంతులుగా కనిపిస్తారు ..అలాగే ఇది ప్రకృతి యొక్క అతి సహజమైన సుందరం. కాని సుందరకాండ లోక సాధారణ స్థితికి భిన్నంగా అత్యద్భుతమైన సౌందర్యం కలిగినది అందుకే "సుందర"కాండ అయ్యింది.
సుందరె సుందరో రామ: సుందరే సుందరీ కథా
సుందరే సుందరీ సీత సుందరే సుందం వనం
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపి:
సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం?
పురషమోహనాకారుడు, సుగుణగణ సుందరుడు శ్రీరాముడు, సర్వ విధములా భువనైక మాత సీతా దేవి. కాంచనాద్రి కమనీయ విగ్రహుడైన హనుమంతుడు పరమసుందరుడు. అశోకవనం అతిలోక సుందరం. శ్రీ సీతరామహనుమంతుల మంత్రములు దివ్యములు సుందరములు. ఈ మహితాత్ముల కధ సర్వాధ్భుత సుందరం. ఈ సుందరకాండ కవిత్వం అత్యంత సుందరం. కనుక ఈ సుందరకాండమునందు సుందరం కానిదేది? సర్వమూ సుందరమే. ఇందు హనుమంతుని చే సీతారాముల వర్ణన అద్భుతము గా చెప్పబడినది.
హనుమంతుని ప్రతిభ ::
హనుమంతుడు జితేంద్రియుడు, ప్రజ్ఞావంతులలో ప్రముఖుడు, వాయు సుతునకు ఏకైక లక్ష్యం. ఒక స్త్రీ ని స్త్రీ ల మధ్యనే వెదుకుట ,అదియును అర్ధరాత్రి వేళ రావణుని ఏకాంత మందిరమున అతని కాంతల మధ్య వెదుకుట , హనుమంతుని యొక్క నిశ్చల బుద్ది కి జితెన్ద్రియత్వమునకు నిదర్సనం.సుందరీ సుందరుల గాధను తెలుపునది సుందరకాండము. సుందరకాండము సాధకుని లో పరమాత్మ యొక్క అంశ శ్రీరాముని తో ప్రకృతి అంశ అయిన సీతమ్మను కలుపుటకు హనుమంతుడు చేసిన "అన్వేషణే ". ఆంజనేయుడు అనగా బుద్ది యోగము.
సుందరకాండ గురించి మా తెలుగు ఆచార్యులు చెబుతుంటే అద్భుతంగా ఉండేది. అందులో హనుమంతుడు లంక నుండి తిరిగి రాముని దర్సించగానే "దృష్టా దేవితి" అంటే చూచితిని సీతను అని అర్ధం వస్తుంది.ఎంతో ఆత్రుత తో ఎదురు చూస్తున్న రామునికి ఈ ఒక్క చిన్న మాట ఆయనుకు ఉపసమనం ఇస్తుంది , ఆ వర్ణ న అద్భుతంగా చెప్పేవారు. లంకా అనే పదాన్ని తిరగ రాస్తే కాలం అనే అర్ధం వస్తుందని , కాలం అనె పదానికి నలుపు అనే అర్ధం వస్తుందని, నలుపు అంటె తమో గుణానికి కారణమని, దానికి బుధ్ధి కి ప్రతీక అయిన హనుమంతుడు పూర్తిగ దహించేట్లు చెయ్యడం లో అర్ధం , మనలోని తమో గుణాన్ని , సరైన బుద్ది తో దూరం చేసుకొవాలని ఎంతో చక్కగ చెప్పేవారు.
రామాయణాన్నిపూర్తిగా చెప్పే లవకుశ లో ఈ పాట నాకెంతో ఇష్టం..
(యూట్యూబ్ మరియు గీతా ప్రెస్స్ వారి సౌజన్యం తో )
Posted by
సుజన దుత్తలూరు
at
3:34 AM
9
comments
Friday, April 11, 2008
ఆహా ఏమి రుచి ..
గోంగూర మీద ఆశ కొంత మందిని దొంగలుగా కుడా మార్చేస్తుందండి. ఇది నిజ్జంగా నిజ్జం ..ఆ మధ్య మా ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది..ఇక ఆ కార్యం లో గోంగూర ఉంటే వచ్చిన వాళ్లు కూడా సంతోషిస్తారు కదా ..అని వంట వాళ్ళని పురమాయించారు మా అమ్మగారు ..అదేంటో గాని ఆ రోజు వంటవాళ్ళు అద్భుతంగా చేసారు గోంగూర పచ్చడి . మొదటి బంతి లో నే కూర్చున్న తెలిసిన ఆవిడ ఒకరు పెరట్లో కి వెళ్లి ఎవరు చూడకుండా గోంగూర పచ్చడి డబ్బాలో పెట్టుకు పోయారట ..ఆ విషయం ఈ మధ్య మా వంట మనిషి చెబితే విని ఆశ్చర్య పోయా ..గోంగూర పచ్చడి పాపం మనుషులని దొంగలు గా కుడా మారుస్తుందని నవ్వుకున్నా ... మా నాన్నగారు చనిపొయే ముందు రోజు చివరి సారి గా కలిసి భోంచేసినప్పుడు గోంగూర పచ్చడి ఉండడం కూడా యాదృచ్చికమేమో..
Posted by
సుజన దుత్తలూరు
at
1:32 AM
13
comments
Labels: స్వగతం
