Thursday, January 17, 2008

జ్ఞాపక శక్తి కి ప్రశంస

రష్యా జానపద కధ వ్రాస్తుంటె నా మస్తిష్కం లో నిగూఢమైన నా జ్ఞాపక శక్తి ని ప్రసంశించుకోలేకుండ ఉండ లేక పోయాను. దాదాపు 10 ఏళ్ళ నాడు చదివిన కధలు నా జ్ఞాపకశక్తి పుటల్లొ అంత పదిలంగ పాత్రధారుల పేర్ల తొ సహ ఎలా ఉండిపొయిందొ అని , ఇది ఇంతకి నా జ్ఞాపక శక్తా లేక ఆ కధ పసి హ్రుదయం లో పాతుకుపోయిన వైనమా అనిపిస్తోంది.కాని నిజానికి పసితనం , బాల్యం మన జీవితాల్లొ చెరగని ముద్ర వేసుకొంటయేమో అంటె అతిశయొక్తి కాదేమో. కొన్ని కొన్ని యదార్థ సంఘటనలు, కధల యొక్క ప్రభావం పసితనం లో నే నాంది వేసుకుంటాయేమో.వాటి వల్లనే మన నడవడిక కుడా ఆధారపడి ఉంటుంది అని కూడా అనిపిస్తోంది. దాదాపు 3వ శతాబ్దం లో విష్ను శర్మ సంస్క్రుతం లో రచించిన "పంచంతంత్ర నీతి కధలు" ఈ రోజుకి మనం చిన్న పిల్లలకి చెప్పడం లోని భావం అదే కదా. ఆ కధలు చిన్న పిల్ల ల భవిష్యత్తు మీద ఎంతగా ప్రభావం చూపుతోందో, మనకి ప్రత్యక్షంగ తెలిసిందే కదా. ఈ సాంకేతిక రంగం లో వచ్చిన మార్పు పిల్లల్ని టివి ల కి ఆకట్టుకునేలా చేస్తున్నాయి. అలాగే వాటిల్లొ చూపించే కక్ష, పగ లు తో కూడుకున్న కొన్ని పాశ్చాత్య కధలు చిన్నపిల్ల ల భవిష్యత్తు పై ఏ విధంగ ప్రభావం చుపుతుందొ అని కించిత్ భయం కుడా వేస్తోంది.
ఆ మధ్య నేను చిన్న పిల్లల కోసం బొమ్మలు కొందామని ఒక పెద్ద బొమ్మల దుకాణానికి వెళ్ళాను. అక్కడ చూసిన దాదాపు అన్ని బొమ్మలు పాశ్చాత్యపు పోకడల తో భీతి ని కొల్పేవి గా ఉన్నాయి. పైగా ఆ బొమ్మలు అరోగ్యానికి హానికరమైన రసాయనాల చే తయారు చేయబడినవి. పిల్లలు కుడా అవే కావాలని పట్టుబట్టడం..ఇవన్ని చూస్తుంటే వారి భవిష్యత్తు ని ఎలా ప్రభావితం చెయ్యగలదో అని కొంచెం బాధ వేసింది. వాటి మోజు లో పడి పిల్లలు మన ఇతిహాసాల్ని, పురాణాల్ని మర్చిపోవడం కూడా సహజమే కదా. కొంతమంది భవిష్యత్తుని దౄష్టిలో పెట్టుకుని ఇప్పటికే మన పురాణాల్ని టివి ల్లో చూపించాలని ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారిని ప్రొత్సహించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇదే తరుణం లో ఈ మధ్య విడుదలైన "ది హనుమాన్ రిటర్న్స్" అనే సినిమా పిల్లల బొమ్మల పై బాగ ప్రభావం చూపింది. పిల్లలందరికి ఇప్పుడు హనుమాన్ గధలు, హనుమాన్ రంగుల పుస్తకాలు, హనుమాన్ పెన్సిల్ పెట్టెలు ఇంక బొలెడన్ని హనుమాన్ రూపం లో ప్రత్యక్షమవుతున్నాయీ...అలాగే వాటి పై మోజు ...ఇవన్ని చూసిన నాకు నాలోని బాధకి కొంచెం ఉపసమనం అనిపించింది. ప్రయత్నిస్తే మన పిల్లల్ని పాశ్చాత్య ధోరణి నుంచి దూరంగ ఉంచవచ్చెమో...

Wednesday, January 9, 2008

రష్యా జానపద కధ (తెలుగు అనువాదం)

నా చిన్నతనం లో రష్యా వారి చే తెలుగు లొ ముద్రించబడిన పుస్తకాలు తక్కువ ఖరీదు లొ విరివిగ దొరికేవి.అలా అప్పుడు ఒక రెండు కధల పుస్తాకాలు మా ఇంట్లొ ఉండేవి నా సెలవు దినాల్లొ కనీసం ఒక్కసారైన చదివేదాన్ని.ఆందులొ మొదటిది " మాయ గుర్రం మేటి గుర్రం " రెండవది " మత్స్య మిత్రుడి మంత్ర మహిమ "
మాయ గుర్రం మేటి గుర్రం
ఒక ఊరులొ ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు కి నలుగురు కొడుకులు, నలుగురి లొ నాలుగవ వాడి పేరు ఇవానుష్క. ఆంతా వీడిని వెర్రి వెంగళాయ ఇవానుష్క అంటుండేవారు.ఒక రోజు రైతు నలుగురు కొదుకులను పిలిచి తమ పొలం లోని మొక్క జొన్న పంటని ఎవరో రాత్రి వేళలో నాశనం చేస్తున్నట్టు తెలుసుకుని అది ఎవరు చేస్తున్నారో తెలుసుకొమ్మని చెప్తాడు.సరే మొదటి వంతుగ పెద్ద కొడుకు పొలానికి వెల్తాడు. పొద్దున్నె తిరిగి వచ్చి ఎవరు రాలేదు అని చెప్తాడు. కాని ఆ రొజు పొలం లొ పంటని ఎవరో తొక్ఖినట్టు తెలుసుకుని రెందవ కొడుకు ని వెళ్ళమంటాడు రైతు. సరె రెందవ కొడుకు కూడా ఏమి తెలుసుకొకుండా ఇంటికి వచ్చేస్తాడు. ఇక మూడవ కొదుకు కూడా తెలుసుకో లేక పోతాడు.ఆఖరి వంతుగ వెర్రి వెంగళాయ ఇవానుష్క ఒక తాడు,రాత్రంత మెలుకొని కాలక్షేపం చేయడానికి ఒక కజ్జికాయ జేబులో వేసుకుని పొలానికి బయల్దేరుతాడు. ఇంతలొ అన్నయ్యలు మేమే పట్టుకోలేకపోయాం వీడెందుకు అని అంతారు, ఐన ఇవానుష్క మాత్రం వారిని లక్ష్య పెట్టకుండ పొలానికి వెళ్ళి పోతాడు.రాత్రంతా జాగారం చేస్తు కుర్త్చుంటాడు ఇవానుష్క. ఇంతలొ ఒక తెల్లని గుర్రం పెద్ద పెద్ద రెక్కలతో పొలం లోకి వచ్చి వాల్తుంది. ఇవానుష్క దాన్ని చూసి ఎలాగైన పట్టూకోవాలని తాడు తీసుకుని గిర గిర తిప్పి సరిగ్గా దాని గొంతుకి బిగిస్తాడు. తప్పించుకోవాలని చుసిన గుర్రం తప్పించుకోలేక చివరకి ఇవానుష్క తో రాజి పడుతుంది.గుర్రం ఇవానుష్క తో ఇలా అంటుంది "ఇవానుష్క నన్ను వదిలిపెట్టూ నువ్వు నన్ను పిలిచిన వెంటనె వస్తాను నువ్వు అడిగింది చేస్తాను " అని అంటుంది. మరి నిన్ను ఎలా పిలవాలి అని అడుగుతాడు ఇవానుష్క. సరే నువ్వు నీకెప్పుడు అవసరం వచ్చినా ఊరికి దూరంగ వెళ్ళి దిక్కులు పిక్కటిల్లేల "మాయ గుర్రమా మేటి గుర్రమా జ్ఞానివైన తేజ గుర్రమా ఇటు రా" అని అరవాలి.అని చెప్పి ఇంకెప్పుడు మీ పొలాన్ని పాడు చెయ్యను అని సెలవు తీసుకుంటుంది. పొద్దున్నె ఇంటికి వచ్చి జరిగింది చెప్తాడు ఇవానుష్క. అందరు ఇవానుష్క ని చూసి చెప్పింది చాలు ఇక పోయి పడుకొ అని హేళనగ నవ్వుతారు.ఇవానుష్క నవ్వుకుంటుపొయ్యితీనె(రష్యా లొ పాత కాలం లొ కింద నిప్పుతొ ఉన్న ఒక గూడులాంటిది ఉండి దాని పైన ఎక్కి పడుకొనేవారు,చలికి వెచ్చగ ఉండడం కోసం) ఎక్కి పడుకుంటాడు.ఇవానుష్క అన్నయ్యలు ఆ రోజు ఆ ఊరిలొని యువరాణి ఎలీన స్వయంవరం గురించి మట్లాడుకుంటుండగ ఇవానుష్క కుడా విని ఎలాగైన తను కుడా స్వయంవరానికి వెల్దామనుకుంటాడు. అన్నయ్యల్ని తీసుకెళ్ళమని అడుగుతాడు. వారు నవ్వి అక్కడికి నీ లాటి వారు రాకుడదని, వదినలకి సహాయంగ ఇంట్లొ ఉండమని చెప్పి వారు వెళ్ళిపోతారు. ఇంతలొ ఇవానుష్క అలోచించి వదినలు పుట్టకొక్కులు కోసుకొని వస్తాను బుట్ట ఇలా ఇవ్వండి అని బుట్ట తీసుకొని ఊరి చివరకు వెళ్ళిబుట్ట ఓ మూల గిరాటేసి దిక్కులు పిక్కటిల్లేల "మాయ గుర్రమా మేటి గుర్రమా ఇటు రా" అని అరవగానే, పెద్ద పెద్ద రెక్కలతో తెల్లని గుర్రం అక్కడ వాలుతుంది. ఇవానుష్క యువరాణి దగ్గరకు తీసుకొని పొమ్మంటాడు. గుర్రం ఐతే నువ్వు నా ఎడమ చెవి లో దూరి కుడి చెవి లో నుండి బయటకు రా అని చెప్తుంది. ఇవనుష్క ఎడమ చెవి లో దూరి కుడి చెవిలో నుండి బయటకు రాగనే టింగురంగామని పూల రంగడు లా తయరైపోతాడు. గుర్రం తన మీద ఎక్కించుకుని యువరాణి కోట కేసి పరుగెడుతుంది. దారిలొ అన్నయల్ని దాటి మరీ వెళ్ళిపోతాడు ఇవానుష్క. వారు అంత వేగంగ మొహం మీద దుమ్ము కొట్టుకుంటు పోతున్న ఈ యువరాజెవరో అనుకుంటు తిరిగి కోట వద్దకు పయనమవుతారు. స్వయంవరం లొని యువరాణి ఒంటి స్థంభం కోట లొ కిటికి పక్కన కుర్చొని ఉన్న ఎలీన చేతి కి ఉన్న వజ్రపుటుంగరాన్ని ఎవరైతే గుర్రం మీద ఎగిరి అందుకుంటారో వారికి ఎలీన ని ఇచ్చి వివాహం చేస్తానని రాజు ప్రకటిస్తాడు. ఎంతో మంది యువరాజులు , యువకులు ప్రయత్నిస్తారు. కాని ఎవ్వరు అందుకొలేకపొతారు. ఇవానుష్క వేగంగా వస్తూనే ఎగిరి ఎలీన ఉన్న కిటికి సరిగ్గా మూడడుగుల్లొ విఫలంవుతాడు. వెంటనే వేగంగా అక్కడి నుండి జారుకుంటాడు. తిరిగి ఊరి చివరకి వచ్చి కుడి చెవి లో దూరి ఎడమ చెవి లొ నుండి బయటకు రాగానె ఎప్పటిలా తయరైపొతాడు. ఇంటికి వెళ్ళి పు ట్టకొక్కులు ఇచ్చేసి ఏమి ఎరగనట్టు పొయ్యితీనె ఎక్కి పడుకుంటాడు. అన్నయ్యలు ఇంటికి రాగానే వారు చూసినవి వింతగ మాట్లాడుకుంటుంటారు. అవి విన్న ఇవానుష్క అన్నయ్యలు నేను మీకక్కడ అవుపడ్డనా అని అడిగితే. వారు నువ్వు మాకవుపడ్డం ఎమిటి పిచ్చెక్కిందా నీకు , ఫొ పొయ్యి పడుకొ ఫొ అని అరుస్తారు. ఇవానుష్క నవ్వుకుంటూ ఏమి ఎరగనట్టు పొయ్యితీనె ఎక్కి ముసుగు పెట్టి నిద్రపోతాడు.
పక్క రోజు కూడా అన్నయ్యలు స్వయంవరం చూడ్డానికి బయలుదేరుతారు. మరల ఇవానుష్క అన్నయ్యలు నన్ను కూడా మీతో తీసుకుని పొండి అని అడుగుతాడు. అన్నయ్యలు ఇంట్లో అందరం వెళ్ళితే ఎలాగ మీ వదినలకి సహాయంగ ఉండమని చెప్పి వెళ్ళిపోతారు. సరే ఇవానుష్క వదినలకి అడవికి వెళ్ళి కట్టెలు కోసుకొని వస్తాను అని చెప్పి అడవికి వెల్తాడు. మళ్ళి దిక్కులు పిక్కటిల్లేల మాయ గుర్రాన్ని పిలుస్తాడు. ఎడమ చెవి లో దూరి కుడి చెవి లో నుండి బయటకు రాగానె టింగురంగామని పూల రంగడులా మారిపోతాడు. ఈ సారి ఎలీన కుర్చొని ఉన్న కిటికి కి సరిగ్గా రెండు అడుగుల్లో విఫలమవుతాడు. అక్కడున్నవారంతా " పట్టుకోండి పట్టుకోండి" అని అరుస్తున్న పట్టించుకోకుండ అక్కడి నుండి జారుకుంటాడు ఇవానుష్క. అడవికి వచ్చి కుడి చెవి లో దూరి ఎడమ చెవి లో నుండి బయటకు రాగానే మామూలుగ తయారైపోతాడు.
ఆఖరి రోజు ఇవానుష్క అడవికని వెళ్ళి మాయ గుర్రం తో తిరిగి కోటకి వెల్తాడు. ఈ సారి ఎలీన చేతికున్న వజ్రపుటుంగరాన్ని తీసుకోవడమే కాకుండా ఎలీన బుగ్గ పై ముద్దు కూడా పెట్టుకుంటాడు ఇవానుష్క. వేగంగా వెళ్ళిపోతున్న ఇవానుష్క ని పట్టుకోవాలని పట్టుకోలేకపోతారు అక్కడ చేరి వింతను చూస్తున్న జనం. ఇంటికి చేరిన ఇవానుష్క వేలికి కట్టేంటని అదిగితే పుట్టకొక్కులు కోస్తుంటే తెగిందని చెప్తాడు. ఇంతలొ అన్నయ్యలు వచ్చి ఏ విధంగ యువరాజు ఉంగారన్ని తీసుకొంది చెప్తుంటె ఇవానుష్క వేలికున్న గుడ్డను తీసేసిఉంగరాన్ని చూసుకుంటాడు. ఇల్లంతా ఒక్కసారి వెలుగుతో నిండి పోతుంది. అది చూసిన అన్నయ్యలు నిప్పనుకొని "ఒరెయ్ నిప్పుతో ఆటలాడకు" అని అరుస్తారు. వెంటనే తిరిగి గుడ్డ ని చుట్టేస్తాడు ఇవానుష్క.
యువరాణి ఎలీన ఉంగరాన్ని తీసుకు వెళ్ళిన ఆ యువరాజు ని తెలుసుకోవడం కోసం రాజు ఆ ఊర్లో ఉన్న వారందరు రాజు ఇచ్చే విందుకు రావలని లేదంటె కఠినంగా శిక్షింపబడుతారని చాటింపు వేయిస్తాడు.అది విని తప్పేది లేక ఇవానుష్క ని కూడా వెంట తీసుకుని వెళ్తారు. యువరాణి స్వయంగా అందరికి వడ్డిస్తూ ఇవానుష్క వద్దకు రాగానే వేలికున్న కట్టేంటని అడుగుతుంది. పుట్టకొక్కులు కోస్తుంటే తెగిందని చెప్తాడు. యువరాణి ఏది ఒక్క సారి కట్టు విప్పు చుద్దాం అని అడుగుతుంది. కట్టు విప్పగానే ఒక్క సారిగా ఆ ఆవరణమంతా వెలుగు తో నిండి పోతుంది.వెంటనే యువరాణి అతడే యువరాజని చెప్తుంది రాజు కి. వెంటనే రాజు ఎలీన కి ఇవానుష్క కి వైభవంగ పెళ్ళి జరిపిస్తాడు. ఈ కధ వ్రాసిన రచయిత చివర్లో ఇలా వ్రాసుకుంటాడు
విందులొ నేను పాల్గొంటి
అంతా గడ్డం పైనే పోసుకుంటి
కొంతైనా పోలేదు నొట్లోకి

Tuesday, January 8, 2008

నా చిన్ననాటి నా కెంతో ఇష్టమైన కధ.

నాకు షుమారు ఏడేళ్ల ప్రాయం కాబోలు , మా పెద్దమ్మ తో పీట మీద కూర్చొని పాలు తాగనని మారాం చేస్తే నాకు లంచం ఇచ్చి (అదే కధ చెప్పి ) పాలు తాగించేసేది మా పెద్దమ్మ. ఆ కధ అంటే నాకు ఎంతో ఇష్టం. అదే అనుభూతిని తలచుకుంటూ ఇక్కడ ఆ కధ వ్రాయాలనిపించింది. అన్ని కధల్లో మాదిరిగానే అనగనగా ఒక పేదరాసి పెద్దమ్మ ఆవిడకి ఓరోజు ఉసిరక్కాయ పచ్చడి తినాలానిపించింది. ఇంట్లో పని ముగించుకుని దుకాణానికి వెళ్ళి మంచి ఉసిరిక్కాయలు తెచ్చుకుంది. సరే ఇక వాటిని కడిగి, ఆరబోసి, ఆరిన తరువాత, తరగడం మొదలుపెట్టింది. ఇంతలో ఒక పెద్ద ఉసిరిక్కాయ "అవ్వ అవ్వ !!నన్ను తరగకు అని చిత్రంగా మాట్లాడుతుంది". అవ్వ కూడా సరేలెమ్మని సరదా పడుతుంది. తనకి కూడా ఎవ్వరూ లేరు కనుక తోడుగా ఉంటుందనుకొంధి.ఇక పొద్దున్నే ఉసిరిక్కాయ వాకిట్లో కూచోని వచ్చే పొయ్యవాళ్ళని చూడటం అవ్వతో సరదా గా కబుర్లు చెప్పటం . ఒక రోజు స్కూల్ కి వెళ్తున్న పిల్లలను చూసి ఉసిరిక్కాయ కూడా స్కూల్ కి వెళ్తానని అవ్వతో చెప్పింది. అవ్వ సరే వెళ్లు కానీ అక్కడ నిన్ను చూసి పిల్లలు ఆట పట్తిస్తారేమో గోల చెయ్యకుండా రమ్మ ని చెప్పింది. సరే ఉసిరిక్కాయ కూడా అందరిలానే లాగూ , చొక్కా తొడుక్కుని బూట్లు వేసుకొని స్కూల్ కి వెళ్తుంది.అవ్వ చెప్పినట్టుగానే కొంత మంది పిల్లలు ఉసిరిక్కాయ చుట్టూ చేరి "హేయ్ ఉసిరిక్కాయ స్కూల్ కొచ్చింది లే , హేయ్ ఉసిరిక్కాయ స్కూల్ కొచ్చింది లే,హేయ్ ఉసిరిక్కాయ స్కూల్ కొచ్చింది లే" అని ఆట పట్టించేసరికి , ఉసిరిక్కాయ బిక్క మొకమెసుకుని ఇంటికి వచ్చి అవ్వతో జరిగింది చెబుతుంది. అవ్వ ఆలోచించి సరే నేను నీకో మంత్రం చెప్తాను ఆది చెప్పావంటే నీ జోలికి ఇక ఎవ్వరూ రారు అని మంత్రం చెబుతుంది అవ్వ. అదెంటంటేఎవరైతే నిన్ను ఏడీపిస్తారో వారికెదురుగా నిలబడి మనసులో మూడు సార్లు " నీ పొట్ట కి నా పొట్ట కి ఠామ్" అని అనాలి అని చెప్పి స్కూల్ కి వెళ్ళమంటుంది. మంత్రం నేర్చుకున్న ఉసిరిక్కాయ ధైర్యంగా స్కూల్ కి వెళ్తుంది . మళ్లీ ఆకతాయి పిల్లలు వచ్చి అల్లరి పట్టించగ ఈ సారి ఉసిరిక్కాయ మనసులో మూడు సార్లు "నీ పొట్ట కి నా పొట్ట కి ఠామ్" అంటుంది అంతే ..చిత్రంగా ఆ పిల్లలందరు చచ్చిపొతారు. అలాగే వరుసగా ఇంకొంతమంది పిల్లలు , ఆ తరువాత వంతుగా మాస్టార్‌లు ఇలా వర్సపెట్టి స్కూల్ మొతం ఖాళీ అయిపోతుంది . ఈ సారి ఆ ఊరి పోలీసులు , పెద్దలు అందరికి ఇదే అనువదిస్తుంది అహంకారంతో ఉన్న ఉసిరిక్కాయ. ఆఖరిగా మంత్రం చెప్పిన పెదరాసి పెద్దమ్మ మీద కూడా అదే మంత్రం చెప్తుంది. అవ్వ కూడా చచ్చి పోతుంది . అహంకారంతో ఉన్న ఉసిరిక్కాయ ఈ ఊరికంత నేనొక్కటే అనుకుంటూ ఎదురుగా ఉన్న అద్ఢము లో చూసుకొన్న తెలివిలేని ఉసిరిక్కాయ ఇంకో ఉసిరిక్కాయ ఉందనుకోని తిరిగి మంత్రాన్ని చదువుతుంది అంతే ....ఇంకెముంది ఆ ఉసిరిక్కాయ కూడా చచ్చి పోతుంది.
కధ అయిపోగానే మా పెద్దమ్మ కధలో నీతి అడిగేది , సమాధానం తెలీని నేను తుర్రు మనే దాన్ని !!!మీకు తెలిస్తే కామెంట్స్ లో తెలియజెయ్యండి...

Friday, January 4, 2008

Google page

I have a another google page http://sujana.duttaluru.googlepages.com/.
This blogging is especially to write in my mother tongue Telugu

First Entry into the Blogging world

This is my first entry into the blogging world. !!!