Sunday, May 25, 2008

కడుపు నిండా మద్యం-తెలుగుదేశానికే ఓటు.

ఉప ఎన్నికల్లో భాగంగా ఇప్పుడు ప్రచారసాధనాల్లో ప్రతి పార్టీ పాటలు, అబినయాలతో వినూత్నంగా ప్రచారం చెయ్యడం బావుంది. కాని తెలుగుదేశం పార్టీ ప్రకటన, ఒక వంతు నవ్వు తెప్పిస్తొంది నా మటుకు.

మనకందరికి సుపరచితమైన సినిమా మిష్టర్ పెళ్ళాం. ఆ సినిమా లో రాజేంద్ర ప్రసాద్ భార్య ఆమని పని చేసే ఎం.డి. గోపాల క్రిష్ణ ని ఒకానొక పాట లో ఆటపట్టించిన సందర్భం గుర్తు వచ్చింది. ఆ పాట చివరిలో "గోపాల క్రిష్ణుడు పక్షి...గోవింద క్రిష్ణుడు పక్షి.." కోరుస్ అంతా కుడా పక్షి పక్షి అంటూంటారు .....ఎం.ఎస్ మొహం లో బాధ ఎక్కువైపోతుంటుంది..అది చూసి రాజేంద్ర ప్రసాద్ ఆనందపడుతుంటాడు. చివరకి కాని చెప్పడు పక్షి వాహనుడై వెడలె అని. వాక్యాలని పూర్తి గా చెప్పాలి లేక పోతే అర్ధాలు మారిపోతుంటాయి

తెలుగుదేశం ప్రకటన లో కూడా ఇదే జరిగింది. సన్నివేశం ఎలా ఉంటుందంటె ఒక తాగుబోతు ఇంటికి తాగి వస్తాడు. భార్య అతన్ని ఉద్దేసించి, పిల్లవాడికి మందులు తెమ్మంటె నువ్వు మందు తాగి వస్తావా అని అడుగుతుంది?పిల్లవాడికి మందులు తెద్దామంటె దబ్బులేక ఆ బాధ లో ఈ మందు తాగనంటాడు ..ఆ సందర్భం లో వాడు "నీ తల్లి బెల్టు తీస్తా అంటాడు.."అందుకు భార్య ఈ సారి చంద్రబాబు నాయుడు వస్తే బెల్టు షాపుల మీదా బెల్టు తీస్తాడు అంటుంది. ప్రకటన లో భాగంగా ఇదెక్కడి ఖర్మ (ఇక్కడ ఉపిరి పీల్చుకునే అంత గాప్) కడుపునిండా మద్యం వెంటనే తెలుగు దేశాన్ని గెలిపించండి అని వస్తుంది . నేను ఈ ప్రకటన మొదట్లొ చివరి రెండు లైన్లు మాత్రామే విన్నా ..చాలా నవ్వు వచ్చింది తరువాత పూర్తిగా విన్నాక అర్ధమైంది. ఏ భాషకైన డిక్షన్ చాల అవసరం లేక పోతే ఇలాగే నవ్వుకోవలసి వస్తుంది.

ఇది తెలుగుదేశం పార్టీ భావాలని కించపరచడానికి రాసింది మాత్రం కాదు. నాకు ఇలా తోచింది అని చెప్పడానికి మాత్రమే. ..

2 comments:

karthik said...

chala delicate point. baga identify chesaru.

Suneel Gudipati said...

meku TDP ante gittada?